ట్రాన్స్జెండర్ల పట్ల సమాజంలో అవగాహన పెంచే ఉద్దేశంతో టీఎస్ఆర్టీసీ ప్రముఖ స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవగాహన పోస్టర్ల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్ డిపోలు, స్టేషన్లలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ట్రాన్స్ విజిబిలిటీ డే సందర్భంగా టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ ఈ పోస్టర్లను విడుదల చేశారు.