భారత సరిహద్దుల వెంట పాకిస్తాన్ కాల్పుల్లో చిన్నారులు, మహిళలు చనిపోవడంపై జమ్మూ&కశ్మీర్ మాజీ సీఎం, PDP చీఫ్ మహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. కళ్ల ముందే ఆటలాడిన కవలలు ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ఇరు దేశాలు సైనిక జోక్యంతో కాకుండా రాజకీయ చర్చలతో సమస్యను పరిష్కరించాలి. సమస్య మూలాల్లోకి వెళ్లకుండా మిలిటరీ చర్యలతో శాంతి లభించదు' అని వ్యాఖ్యానించారు.