అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందనున్న తాజా చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్లో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, దిశా పటాని నటించనున్నట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.