TG: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పడాలపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో వర్షం రావడంతో నలుగురు బాలురు చెట్టు కిందకి వెళ్లి నిలిచారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఇద్దరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.