చైనాకు చెందిన టెక్నో సంస్థ రెండు ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. టెక్నో పోవా7 5జీ, టెక్నో పోవా7 ప్రో 5జీ మోడళ్లను విడుదల చేసింది. విభిన్న డిజైన్తో బడ్జెట్ ధరలో ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెండింట్లోనూ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. టెక్నో పోవా7 బేస్ మోడల్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.12,999. టెక్నో పోవా7 ప్రో 5జీ వేరియంట్ ధర రూ.16,999.