విద్యుత్ షాక్‌తో పొలంలో ఇద్దరు రైతులు మృతి (వీడియో)

66చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. మృతులను భిఖారియా గ్రామానికి చెందిన భలాయ్ యాదవ్(40), కిసాన్ లాల్(65) గా గుర్తించారు. ఇద్దరూ పొలాలను చూసేందుకు వెళ్లగా.. పొలంలో ఉన్న 11 వేల వోల్టుల విద్యుత్ స్తంభం నుంచి రైతులకు షాక్ తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్