పాకిస్తాన్కు గూఢచార్యం చేస్తున్నారనే అనుమానంతో ఉత్తరప్రదేశ్కు చెందిన మరో ఇద్దరిని శుక్రవారం ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమ వీసా, సున్నితమైన జాతీయ భద్రతా సమాచారాన్ని చేరవేయడం లాంటి అంశాలలో వీరిపై బలమైన సందేహాలు ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు సీలంపూర్లో స్క్రాప్ డీలర్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న ముజమ్మల్ హుస్సేన్తో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు.