మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి భీవాండి పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ బాయిలర్ మీద పడి ఇద్దరు కార్మికులు మరణించారు. బాయిలర్ను క్రేన్తో ఎత్తుతుండగా జారి వారి మీద పడిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.