TG: తరుచూ భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుండటంతో, మనస్థాపానికి గురైన భర్త చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..భూపతి(50) అనే వ్యక్తి తాగుడుకు బానిసై పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. దీంతో భార్య భర్తలకు తరచూ గొడవలు జరిగేవి. ఈ గొడవలతో మనస్థాపం చెందిన భర్త చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.