తెలంగాణలోని హనుమకొండలో స్వయంభూ సిద్దేశ్వరాలయంలో ఏటా ఓ ఆశ్చర్యకర ఘటన జరుగుతోంది. ప్రతి ఏటా వినాయక ఉత్సవాలు జరిగే సమయంలో భాద్రపద మాసంలో మూడు రోజుల పాటు శివలింగంపై సూర్యకిరణాలు పడతాయి. చుట్టూ కొండలు, గుట్టలు, ఆలయంలో భారీ ద్వారాలను దాటి గర్భగుడిలో శివలింగంపై సూర్యకిరణాలు పడతాయి. తర్వాత ఓ పాము శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. ఎన్ని పరిశోధనలు జరిగినా ఇది అంతుచిక్కని రహస్యంగా మారింది.