2025 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్లో ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీల వంటి డిజిటల్ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ వాహనాల రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నందున ఈసారి విద్యుత్ వాహనాలపై పన్ను రాయితీలు లేదా మరింత ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంది.