కేంద్ర మంత్రి సుకాంత మజుందార్కు పోలీసులు భారీ షాకిచ్చారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, 280 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ముర్షిదాబాద్ అల్లర్ల కోసం విరాళాలు సేకరించేందుకు వెళ్లిన సుకాంతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మిగతా బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు.