TG: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. అయితే ఈ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం, జిల్లాల వారీగా వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇటీవల సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు కూడా స్వయంగా పలువురు రైతులను పరామర్శించి ఆదుకుంటామని తెలిపారు. వివరాలు అందాక, డబ్బులు జమ చేసే అవకాశం ఉంది.