మాజీ సీజేఐ అధికారిక నివాసాన్ని వీలైనంత త్వరగా ఖాళీ చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్క్లో సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసం ఉంటున్న బంగ్లాను అత్యవసరంగా ఖాళీ చేయించాలని పేర్కొంది. ఆయన పదవీ విరమణ అనంతరం బంగ్లాను ఖాళీ చేయాల్సిన గడువు ముగిసిపోయి కూడా ఆరు నెలలు అవుతోందని సుప్రీం లేఖలో పేర్కొంది.