తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. ఇక నుంచి భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా, రాత్రి భోజనంలో కూడా వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఆదివారం సాయంత్రం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు స్వయంగా వడ్డించారు.