వాముతో మహిళలకు మేలు: నిపుణులు

78చూసినవారు
వాముతో మహిళలకు మేలు: నిపుణులు
వాముతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో వాము, జీలకర్ర వేసి మరిగించి తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. వాము నీటిని తాగడం వల్ల గర్భిణీల్లో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. అలాగే దగ్గు, ఆర్థరైటిస్ నొప్పికి ఉపశమనం లభిస్తుంది. వేయించిన వామును పాలలో కలిపి తాగితే నెలసరి నొప్పి కూడా తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్