ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం(PJTSAU)లో చెట్ల తొలగింపుపై వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య స్పష్టత ఇచ్చారు. యూనివర్సిటీలోని 150 ఎకరాల్లో HMDA సహకారంతో పచ్చదనాన్ని పెంచే విధంగా పర్యావరణహితమైన మొక్కలను మొక్కలు నాటుతున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే సుబాబుల్, యూకలిప్టస్ వంటి చెట్లను తొలగించి వాటి స్థానంలో నాటే కార్యక్రమాన్ని HMDA చేపట్టిందన్నారు. యూనివర్సిటీలో వనమహోత్సవం కార్యక్రమాన్ని CM రేవంత్ సోమవారం ప్రారంభిస్తారన్నారు.