రూ.178 కోట్లతో వేములవాడ అభివృద్ధి: ప్రభుత్వ విప్

72చూసినవారు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అలయాన్ని మొదటి విడతగా రూ.178 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు కాంగ్రెస్ MLA, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసరాలు, గుడి చెరువు, భీమేశ్వర ఆలయం తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనువంశిక అర్చకుల సూచనల మేరకు ఆలయ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్