చందూ మొండేటి డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘తండేల్’. ఈ సినిమాలో నాగచైతన్య సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించింది. అయితే ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో మూవీ చూడటానికి వెళ్లిన ఓ యువతి సాయిపల్లవి పాట రాగానే.. థియేటర్లో అచ్చం హీరోయిన్ లాగా డ్యాన్స్ వేసింది. ప్రేక్షకులంతా ఒక్కసారిగా ఆమె డ్యాన్స్కు ఫిదా అయ్యారు. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.