ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణ ఘటన జరిగింది. స్కార్పియో కారు నడుపుతున్న యువకుడు ఇనుప రాడ్తో ఇ-రిక్షా డ్రైవర్ను కొట్టి చంపాడు. పుట్టా రోడ్డులో రోడ్డుపై జరిగిన ఘటనలో ఈ-రిక్షా డ్రైవర్కు కారు డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన యువకుడు దళిత ఈ-రిక్షా డ్రైవర్ నరేష్ను ఇనుప రాడ్తో కొట్టి చంపాడు. దాడి చేసిన యువకుడు మద్యం తాగి ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.