టీకాంగ్రెస్ పై ఆ పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదిగలను కాంగ్రెస్ తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. 'మాదిగలం 80 లక్షలమంది ఉన్నాం. మాకు ఒక్క సీటు కూడా లేదా? ఒకే కుటుంబానికి రెండు మూడు టికెట్లా..? మాదిగలు ఓట్లేయకపోతే కాంగ్రెస్ భవిష్యత్తేంటి? నేను 10మంది సీఎంలను చూశాను. ఈ రకంగా ఎవరూ చేయలేదు. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోసం రోజూ ట్రై చేస్తున్నా, ఇవ్వట్లేదు' అని మండిపడ్డారు.