TG: రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన సంతోష్ అనే కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందాడు. సొంత ఇళ్లు లేకపోవడంతో మృతదేహాన్ని ఉంచి భార్య శారద, ముగ్గురు పిల్లలతో రాత్రంతా అంబులెన్స్లోనే ఉన్నారు. దీంతో మండలానికి చెందిన మానవతావాదులు సుమారు 50 వేల వరకు ఫోన్పే ద్వారా ఆ కుటుంబానికి అందించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందించి అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి తెలిపారు.