మహబూబ్నగర్ బిజెపి ఎంపీగా గెలుపొందిన డీకే అరుణ బుధవారం మొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడలి నుండి ఏబీకే ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషి చేసిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.