దౌల్తాబాద్ మండల పరిధిలోని బాలంపేట, తిమ్మారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన కావలి లక్ష్మి, అన్వర్ పాషా తమ ఫోన్లు పోగొట్టుకున్నామని ఇటీవల దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా సిఈఐఆర్ ద్వారా ట్రేస్ చేసి పోగొట్టుకున్న ఫోన్ల ఆచూకీ గుర్తించారు. బాధితులకు శుక్రవారం ఎస్ఐ రవి గౌడ్ ఫోన్లు అందజేశారు.