దుద్యాల మండలానికి చెందిన రికార్డ్ అసిస్టెంట్ మేకల మోహన్ ఉత్తమ ప్రశంస పత్రం అందుకున్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం వినోద్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ రికార్డు అసిస్టెంట్ ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసిన సేవలకు గాను జిల్లా స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని మోహన్ తెలిపారు.