వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో గురువారం మండల బిజెపి అధ్యక్షులు సూర్య కాంత్ ఆధ్వర్యంలో 124 బిజెపి బూత్ అధ్యక్షునిగా ఆంజనేయులు, బిజెపి 125 బూత్ అధ్యక్షునిగా గోపాల్ ను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. భాజపా పార్టీ పట్టిష్టతకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు వెంకటేష్, భీమయ్య, సత్తయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.