కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండల కేంద్రంలో వెలిసిన జ్ఞాన సరస్వతీదేవీ ఉత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలను అలంకరించారు. పాఠశాలలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు.