వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని అప్పయిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కొడంగల్ తహసిల్దార్ బి. విజయకుమార్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యం గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలని సూచించారు.