ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తం గా ఉండాలని చన్గోముల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి విద్యార్థినిలకు సూచించారు. మండల పరిధిలో ని ఎన్కెపల్లి మోడల్ స్కూల్ లో ఆన్లైన్ మోసాలు, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. వాట్సాప్ లలో తెలియని లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. బాల్య వివాహాలు చేయడం నేరమని, బలవంతంగా చేస్తే డయల్ 100కు నేరుగా పిర్యాదు చేయాలని తెలిపారు.