వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండల పరిధిలోని రేగడి మైలారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ సంఘాల తాలూకా అధ్యక్షుడు రమేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ.. సావిత్రిబాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సావిత్రిబాయి పూలే బడుగు బలహీన వర్గాలకు యావత్ స్త్రీ జాతికి ఆదర్శమన్నారు.