క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహద పడతాయని ఎన్ యు రాంరెడ్డి తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఖోఖో పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల లాంటివి అలవడి విద్యాభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయన్నారు. ప్రత్యేక అధికారి కే. వెంకట్ రెడ్డి, నాయకులు ఎన్. ప్రశాంత్, ప్రిన్సిపల్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.