ప్రజా పాలన దరఖాస్తుల సవరణకు గడువు పొడిగించాలని గండీడ్, మహమ్మదాబాద్ మండలాల ప్రజలు కోరుతున్నారు. రూ. 500కు సిలిండర్, 200 యూనిట్ల లోపు కరెంట్ వాడే లబ్దిదారులకు '0' బిల్లు అమలు కాని వారి దరఖాస్తుల సవరణకు గత వారం రోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రంలో విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. నేటితో గడువు ముగియడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.