తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గ ప్రమాణ స్వీకారంకు ముహుర్తం ఖరారు అయ్యింది. ఆగస్టు 5న ప్రమాణ స్వీకారంకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా సాయిపూర్ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్గా మదికొండ నర్సిరెడ్డి, సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నారు.