దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని జై కొడుతున్నారని, ఢిల్లీలో బీజేపీ గెలుపే ఇందుకు నిదర్శనమని గండీడ్ బీజేపీ నాయకులు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27ఏళ్ల తరువాత బీజేపీ అధికారంలోకి రావడం పట్ల శనివారం గండీడ్ మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేలుస్తూ. పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకున్నారు. కార్యక్రమంలో మల్కయ్య, బద్రిశ్వర్, మోహన్ బిజెపి నేతలు పాల్గొన్నారు.