తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వికారాబాద్లో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది.