వికారాబాద్ జిల్లాలో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యా యి. గత రెండు, మూడు నెలలుగా నీటికోసం ప్రజలు అల్లాడుతున్నారు. సుమా రు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంపై ప్రస్తుత సర్కార్లో పర్యవేక్షణ కరువైంది. మిషన్ భగీరథకు సంబంధించి గ్రిడ్ లేదా ఇం ట్రా విలేజ్లో నీటి సరఫరా ఆగిపోయినా సంబంధిత అధికారులు స్పందించడం లేదు.