భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన టెస్టు క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 20న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐకి తెలియజేసినట్లు ఇండియా టుడే వర్గాలు తెలిపాయి. కొన్ని రోజుల క్రితమే కోహ్లీ తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు తెలుస్తోంది.