మహారాష్ట్రలోని పూణె జిల్లా పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. పూణె నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ వోల్వో బస్సు హైవేపై కాలిపోయింది. బస్సు ఖేడ్ శివపూర్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు గమనించి వెంటనే కిందికి దిగేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.