భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్గా క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టారు. ప్రధాన కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ తన తల్లి అనారోగ్యం కారణంగా భారత్కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. కాగా గంభీర్ తిరిగి వచ్చేవరకు లక్ష్మణ్ భారత జట్టు సన్నాహాలను పర్యవేక్షిస్తారు. గతంలో కూడా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు లక్ష్మణ్ మార్గదర్శకత్వం వహించారు.