TG: విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ కస్టమర్కి రూ.55,313 కరెంట్ బిల్ వచ్చింది. కరీంనగర్లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బి.సదయ్య అనే వ్యక్తి ఓ లాడ్జిని నిర్వహిస్తున్నాడు. ఆ లాడ్జిలోని మీటర్ చెడిపోయిందని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు వాపోయారు. అలాగే లాడ్జి మీటర్కు కెపాసిటర్ను బిగించాలని అధికారులు చెబితే.. కెపాసిటర్ బిగించానని అతను తెలిపారు. కెపాసిటర్ బిగించలేదని జరిమానా రూ.4560 వేసి మొత్తం బిల్లు రూ.55,313 వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.