కొత్తకోట: పంచామృతాలతో అభిషేకాలు

62చూసినవారు
కొత్తకోట మండలం కానాయపల్లి కోటిలింగేశ్వర దేవస్థానం పరిధిలో నిర్మితమైన ధ్యాన మందిరంలో ప్రదోషకాల పూజలు వైభవంగా నిర్వహించారు. పాదరస సహిత నవరత్నాలంకృత స్వర్ణ కవచ పంచలోహ శివలింగానికి అర్చకుల వేదమంత్రాల మధ్య భక్తులు ప్రదోషకాలంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామివారికి ఏక హారతి, పంచ హారతి, నక్షత్ర హారతులను సమర్పించారు.

సంబంధిత పోస్ట్