పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం మక్తల్ నియోజకవర్గంలోని భూత్పూర్ లో ఉన్న స్వయంభూ భద్దిపల్లి ఆంజనేయస్వామిని స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.