కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవల్లి మండల ఎస్సై రాము శుక్రవారం హెచ్చరించారు. ప్రస్తుతం పొలాలు దున్నే సమయం కాబట్టి ట్రాక్టర్ యజమానులు కేజీ వీల్స్ ను ఉపయోగించి రోడ్లపైకి రావద్దన్నారు. కేజీ వీల్స్ తో బీటీ రోడ్లు, సీసీ రోడ్లపై నడపడం వల్ల రోడ్లు పాడవుతాయన్నారు. ఈ విషయంలో ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు సహకరించాలని, లేదంటే మోటార్ వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.