బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా రంజక బడ్జెట్ అని, వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందని, ముఖ్యంగా యువతకు, మహిళలకు, రైతులకు, మధ్యతరగతి వారికి లాభం చేకూరుస్తుందని బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ను బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు మంగళవారం బీజేపీ శ్రేణులు వనపర్తి లోని రాజీవ్ చౌక్ లో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.