భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల వైపు వెళ్తున్నాయి. ఉదయం 9.31 గంటల సమయానికి సెన్సెక్స్ 560 పాయింట్లు నష్టపోయి 79,763 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 176 పాయింట్లు నష్టపోయి 24,097 వద్ద ట్రేడవుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మదుపరులు షేర్ల అమ్మకాల వైపు మొగ్గు చూపుతుండటంతో సూచీలు నష్టాలు చవిచూస్తున్నాయి.