పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని రైల్వేలో భారీగా అక్రమ ఆయుధాలు పట్టుబడ్డాయి. యూపీ త్రిపుర సుందరి ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 14620) లో RPF ఎస్కార్ట్ టీం తనిఖీలు నిర్వహించగా, బదర్పూర్ నుంచి అగర్తలా వెళ్లుతున్న రైలు జనరల్ కోచ్లోని ఎగువ బెర్తాలో ఉన్న రెండు బ్యాగుల్లో మూడు హ్యాండ్ మేడ్ పిస్టల్స్, 16 మ్యాగజైన్లు బయటపడ్డాయి. ఘటనపై RPF దర్యాప్తు ప్రారంభించింది.