భూపాలపల్లి జిల్లా చైన్ పాక గ్రామానికి చెందిన డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులు మరోసారి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్తన్నని కలిసి తమ సమస్యను వివరించారు. ఇప్పటికే మంజూరైన ఇళ్ల నిర్మాణాలు ఇంకా పెండింగ్లో ఉండటంతో, వాటిని త్వరగా పూర్తి చేసి కేటాయించాలని వారు కోరారు. ఈ సమావేశంలో చిట్యాల మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, గ్రామ అధ్యక్షుడు మాంత మనోహర్, లబ్ధిదారులు పొన్నాల చిరంజీవి, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.