శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 33/11 కేవి సబ్ స్టేషన్ మరమ్మత్తులు చేయనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మరమ్మత్తుల కారణంగా భూపాలపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 8 గంటల నుండి 9. 30 నిమిషాల వరకు, జంగేడు సబ్ స్టేషన్ పరిధిలోఉదయం 9. 30 నిమిషాల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని వినియోగదారులు గమనించి తమకు సహకరించాలని ఏఈ కోరారు.