భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఆపరేషన్ సింధూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా హనుమాన్ ఆలయంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీసి ఉగ్రవాదుల దాడిలో మరణించిన పర్యాటకుల ఆత్మ శాంతి కోసం మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొన్నారు.