భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నందు త్రివేణి సంగమం ఒడ్డున ఏర్పాటు చేసిన (17) అడుగుల సరస్వతీ మాత విగ్రహం, రెండు వైపుల చతుర్వేద మూర్తుల విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంట్, శాసనమండలి, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.